మైలైఫ్ ఆటోబయోగ్రఫీ గ్రంథాన్ని ఆవిష్కరించిన రోశయ్య
అఫ్జల్గంజ్,హైదరాబాద్: పి.నర్సారెడ్డి రాజకీయాలపై పూర్తి అవగాహన కలిగిన గొప్ప రచయితగా తన జీవితంలో జరిగిన విషయాలను మైలైఫ్ ఆటోబయోగ్రఫీ పుస్తకాన్ని రచించడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య పేర్కొన్నారు. శనివారం రాత్రి నాం పల్లి ఎగ్జిబిషన్ మైదానంలోని సొసై టీ కార్యాలయంలో పి.నర్సారెడ్డి రచించిన మైలైఫ్ ఆటోబయోగ్రఫీ గ్రంథ ఆవిష్కరణ ఘనంగా జరిగింది. కార్యక్రమానికి మా జీ గవర్నర్ రోశయ్య, టీపీపీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, కేంద్ర మాజీమంత్రి ఎస్.జయ్పాల్రెడ్డి, శాసనసభ ప్రతిపక్ష నేత జా నారెడ్డి, ఎమ్మెల్సీ పి.సుధాకర్రెడ్డి, మాజీ మం త్రులు పొన్నాల లక్ష్మయ్య, మర్రి శశిధర్రెడ్డి, మహ్మద్ షబ్బీర్ అలీ, పాల్వాయ్ గోవర్థన్రెడ్డిలు ముఖ్యఅతిథులుగా హాజరై మైలైఫ్ ఆ టోబయోగ్రఫీని ఆవిష్కరించారు.
రోశయ్య మాట్లాడుతూ పి.నర్సారెడ్డి రచించిన గ్రంథం తన స్వీయచరిత్ర అని ఇందులో సమాజాన్ని ప్రభావితం చేసే పలు అంశాలు క్లుప్త్తంగా వివరించారని తెలిపారు. చాలా రోజుల తర్వాత ఇక్కడికి వచ్చానని పాత స్మృతులు తనకు గుర్తుకొచ్చాయని చెప్పారు. నర్సారెడ్డి ఆయురారోగ్యాలతో జీవించాలని భగవంతున్ని కోరుతున్నానని తెలిపారు. ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ నర్సారెడ్డి రాజకీయాల్లో సర్పంచ్ నుంచి రాష్ట్రమంత్రిగా అనేక పదవులలో కాంగ్రె్సపార్టీకి ఎంతో సేవచేశారని గుర్తుచేశారు. ఈ పుస్తకం చదివినప్పుడు అందరిజీవితాలు ప్రభావితం చేసేలా ఉందని జానారెడ్డి అన్నారు. జైపాల్రెడ్డి మాట్లాడుతూ నర్సారెడ్డి రచించిన మైలైఫ్ ఆటోబయోగ్రఫీ పుస్తకాన్ని ఆవిష్కరించడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు. కార్యక్రమంలో ఎగ్జిబిషన్ సొసై టీ ప్రతినిధులు వనం వీరేందర్, హన్మంతరావు, డాక్టర్ గంగాధర్ పాల్గొన్నారు.