బొల్లికుంటలోనే రుద్రమ వీర మరణం
చెన్నై దక్షిణ జోన్ పురావస్తు శాఖ సూపరింటెండెంట్
మామునూరు(వరంగల్ అర్బన్), మార్చి 14 : వరంగల్ అర్బన్ జిల్లా ఖిలా వరంగల్ మండలం బొల్లికుంటలోనే రాణి రుద్రమదేవి వీర మరణం పొందిందని చెన్నై దక్షిణజోన్ పురావస్తు శాఖ సూపరింటెండెంట్ కన్నబాబు తెలిపారు. నల్లగొండ జిల్లా పందుపట్లలో ఆమె మరణించినట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. బొల్లికుంట చెన్నకేశవ దేవాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అనంతరం గ్రామస్థులతో సమావేశమయ్యారు. రుద్రమదేవి ఆనవాళ్ల ఆధారంగా గ్రామంలో ఏర్పాటు చేసిన చారిత్రక ఆధారాలైన రెండు శిల్పాలకు భద్రత కల్పించాలని కన్నబాబు కోరారు. రుద్రమదేవికి 80 ఏళ్ల వయసు ఉండగా జరిగిన యుద్ధంలో మరణించినట్లు వివరించారు.