నెల్లూరు, మే 22: తన పేరుతో ఇచ్చే జాతీయ పురస్కారాన్ని ఈ ఏడాది సుప్రసిద్ధ నేపథ్య గాయని ఎస్‌.జానకికి అందచేస్తున్నట్టు గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రకటించారు. మంగళవారం నెల్లూరులో ఆయన మాట్లాడుతూ జూన్‌ 4వ తేదీ నెల్లూరు టౌన్‌హాలులో ఎస్‌.జానకికి ఈ పురస్కారం అందచేయనున్నట్టు తెలిపారు.