చిక్కడపల్లి, మార్చి19(ఆంధ్రజ్యోతి): సమాజహితానికి భగవన్నామ స్మరణ అవసరమని తెలంగాణ బీసీ కమిషన్ సభ్యుడు డా. వకుళాభరణం కృష్ణమోహనరావు అన్నారు ఉదయరాగం సంస్థ ఆధ్వర్యంలో యాదాద్రి బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహ గానామృతం(భక్తి గానసుధ) కార్యక్రమం మంగళవారం త్యాగరాయగానసభలో ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న కృష్ణమోహనరావు సంస్థ నిర్వాహకుడు, గాయకుడు ఉదయ్ముద్గల్ను సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉదయ్ ముద్గల్ నిర్వహించిన శ్రీ లక్ష్మీనరసింహగానామృతం భక్తిపారవశ్యంలో ముంచెత్తిందన్నారు. కార్యక్రమంలో కళా జనార్దనమూర్తి, డా, విజయ్కుమార్, విన్నకోట మురళీకృష్ణ, రవిశర్మ, సంయుక్త , తదితరులు పాల్గొన్నారు.