తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం శ్రీ వేంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో నవరస నటసమాఖ్య 19వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీత కళాతపస్వి పద్మశ్రీ డాక్టర్‌ కె.విశ్వనాథ్‌ను స్వర్ణకంకణం, గజమాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమానికి ఎంపీ మాగంటి మురళీమోహన్‌, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, మేయర్‌ రజనీ శేషసాయి హాజరయ్యారు.

- రాజమహేంద్రవరం సిటీ, ఆంధ్రజ్యోతి