చిక్కడపల్లి/హైదరాబాద్: నగరంలోనే ప్రతిష్ఠాత్మక కళావేదిక శ్రీత్యాగరాయగానసభ అధ్యక్షుడు, విశ్వభూషణ్ అవార్డుగ్రహీత డా.కళావెంకట దీక్షితులు(60) మరణించారు. మంగళవారం ఉదయం తొమ్మిదిన్నర ప్రాంతంలో గుండె నొప్పి తో ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. దీక్షితులు మృతిపట్ల పాలకవర్గసభ్యులు సంతాపం ప్రకటించి మూడ్రోజులపాటు గానసభను మూసేస్తు న్నట్టు ప్రకటించారు. ఆయన అంత్యక్రియలు బన్సీలాల్పేట శ్మశానవాటికలో జరిగాయి. జంటనగరాల్లోని కళాసంస్థల ప్రతినిధులు ఆయన ఇంటికి చేరుకుని నివాళులర్పించారు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, జ్ఞానపీఠ పురస్కారగ్రహీత సి.నారాయణరెడ్డి, బీజేపీనేత కె.లక్ష్మణ్, తెలుగు వర్సిటీ పూర్వ రిజిస్ట్రార్ గౌరీశంకర్, మాజీమంత్రి జి.వినోద్, రిటైర్డు ఐయ్యేఎస్ అధికారి పీవీఆర్కే ప్రసాద్, మాజీ డీజీపీ ప్రభాకర్రావు, ఓలేటి పార్వతీశం తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.