హైదరాబాద్, 19-03-2018: ప్రింట్‌ అండ్‌ ఎలక్ర్టానిక్‌ మీడియా రంగంలో విశిష్ఠ సేవలందించిన పాత్రికేయులకు విళంబినామ సంవత్సర ఉగాది పురస్కారాలు-2018 ప్రదానం చేయనున్నట్లు శృతిలయ ఆర్ట్స్‌ అకాడమీ వ్యవస్థాపక కార్యదర్శి అమని, చైర్మన్‌ ఆర్‌ఎ్‌స.సింగ్‌ తెలిపారు. సీల్‌వెల్‌ కార్పొరేషన్‌ బండారు సుబ్బారావు ఆధ్వర్యంలో 20న సాయంత్రం 5 గంటలకు రవీంద్రభారతిలో ఈ పురస్కారాల ప్రదానోత్సవం ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా తెలంగాణ శాసనసభ స్పీకర్‌ సిరికొండ మధుసూదనాచారి, తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌, విద్యుత్‌, ఎస్సీ, అభివృద్ధి శాఖ మంత్రి జగదీ్‌షరెడ్డి, శరణంగచ్చామి చిత్ర నిర్మాత బొమ్మకు మురళీ, ప్రముఖ కవి కొత్త శ్రీనివాస్‌, కళాపోషకులు హరినారాయణ, హైకోర్టు న్యాయవాది టి.రాజశేఖర్‌, తెలంగాణ శోభన్‌బాబు సేవా సమితి అధ్యక్షుడు టి.రామకృష్ణ పాల్గొననున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా నవరస గాయని అమని ఆధ్వర్యంలో అమని పాడేవే హాయిగా శీర్షికన సినీ సంగీత విభావరిలో ప్రముఖ గాయని, గాయకులు కె.వెంకట్రావ్‌, పి.సుభాష్‌, మద్దెల శివకుమార్‌ తదితర గాయకులు గీతాలు అలపిస్తారని ఆయన తెలిపారు.