హైదరాబాద్, ఆగస్టు12(ఆంధ్రజ్యోతి): సమాజంలో మానవత్వపు విలువలను వల్లరి గజల్స్ రచన పెంపొందిస్తుందని వక్తలు పేర్కొన్నారు. శంకరం వేదిక ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి సుందరయ్య విజ్ఞానకేంద్రంలో కళారత్న కృష్ణ బిక్కి రచించిన వల్లరి(గజల్స్) ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. పుస్తకాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరాం ఆవిష్కరించారు. ఆవిష్కృత గ్రంథాన్ని శంకరం వేదిక అధ్యక్షుడు, ప్రముఖ సంఘ సేవకుడు యలవర్తి రాజేంద్రప్రసాద్- ధనలక్ష్మి దంపతులు అంకితం తీసుకున్నారు. ఈ సమావేశంలో ప్రముఖ కవి, విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి చంద్రకుమార్, ప్రముఖ కవి మువ్వా శ్రీనివాసరావు, ప్రముఖ కవి, సినీగేయ రచయిత, ప్రజా వాగ్గేయకారుడు గోరేటి వెంకన్న రాష్ట్రపతి అవార్దుగ్రహీత యడ్లవల్లి మోహనరావు, సీనియర్ పాత్రికేయుడు బైస దేవదాసు తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ రచనలో స్త్రీల అణిచివేత, రాజకీయాలు, మానవత్వం పతనమౌతున్న తీరు, ప్రపంచీకరణ విధానాలు తదితర అంశాలపై రాసిన గజల్స్ సమాజంలో చైతన్యాన్ని నింపుతాయన్నారు. సినారె గజల్స్ రచనలతో సాంఘి క చైతన్యాన్ని సమాజంలో నింపారని ఆ వరుసలో బిక్కి కృష్ణ ఈ రచన చేయడం హర్షణీయమ న్నా రు. సమాజానికి ఏదో చేయాలనే తపన కృష్ణలో ఉందని ఆ తపనే ఆయనను మంచి కవిగా, విమర్శకులుగా, సమీక్షకులుగా, పాత్రికేయుడిగా చేసిందన్నారు. ఇలా ఓ గజళ్ల కవినీ చేసిందన్నారు. ఈ సమావేశంలో రామదాసప్పనాయుడు, వేణు ఊడుగుల, స్వరూప, బాలాజి, బంగార్రాజు, రాజావాసిరెడ్డి, మల్లీశ్వరి, రోచిస్మాన, మాధవ్, రంగారెడ్డి, చంద్రశేఖర్శర్మ, రమాదేవి, పి.ఎన. మూర్తి తదితరులు పాల్గొన్నారు.