ఉప్పల్‌,హైదరాబాద్: ఓయూలో అంబేద్కర్‌ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వీసీ ప్రొఫెసర్‌ రామచంద్రం వెల్లడించారు. ఆర్ట్స్‌ కళాశాల వద్ద శనివారం జరిగిన అంబేద్కర్‌ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ అంబేద్కర్‌ ఆలోచన దృక్పథంపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరముందన్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ జయంతి సందర్భంగా ఓయూలో దళిత విద్యార్థి సంఘాలు ఘనంగా వేడుకలను నిర్వహించాయి. ఓయూ ఆర్ట్స్‌ కళాశాల వద్ద డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ జీవిత చరిత్ర నాటకాన్ని ప్రదర్శించారు.ఈకార్యక్రమంలో ఓయూ రిజిస్ర్టార్‌ ప్రొఫెసర్‌ గోపాల్‌రెడ్డి, స్డూడెంట్‌ అఫైర్స్‌ డీన ప్రొఫెసర్‌ లక్ష్మీనారాయణ, ఎస్సీ,ఎస్టీ సెల్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ చండ్రూనాయక్‌ పాల్గొన్నారు.