పద్మారావునగర్, హైదరాబాద్(ఆంధ్రజ్యోతి): ప్రముఖ పాత్రికేయులు, ఆకాశవాణి న్యూస్ రీడర్ పీఎస్ఆర్ ఆంజనేయశాస్ర్తి స్మారక పాత్రికేయ, ఆకాశవాణి పురస్కారాల ప్రధానోత్సవ సభ ముషీరాబాద్లోని జ్ఞాన సరస్వతి ఆలయంలో ఆదివారం ఘనంగా జరిగింది. వాజపేయం, కొవ్వూరు మహాజన సభ సంయుక్తంగా నిర్వహించిన ఈ సభకు డాక్టర్ జె.చెన్నయ్య అధ్యక్షత వహించగా ప్రముఖ సినీ రచయిత ఆదిత్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రముఖ పాత్రికేయులు డీఎస్ వరదాచారికి పాత్రికేయ పురస్కారం, అద్దంకి శ్రీరాంకుమార్కు ఆకాశవాణి పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ ఆంజనేయశాస్ర్తి సమాజానికి అందించిన సేవలు మరువలేనివని, పాత్రికేయ రంగంలో వారు ఎందరికో మార్గదర్శకులని కొనియాడారు. ఎన్ఎస్ వాజపేయి, పి.పూర్ణచంద్రరావు, పి.బాలమురళీకృష్ణ, పి.శ్రీకాంత్, నళిని, జయ, పోణంగి బాలభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.