పంజాగుట్ట,హైదరాబాద్: సొసైటీ ఫర్ ప్రమోషన్ టాల రెన్స్ ( స్పాట్) ఆధ్వర్యంలో ప్రముఖ రచయిత సయ్యద్ అలీ హష్మీ రాసిన 1948 అవాయిడబుల్ ఇన్వాయిజన్ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం శనివారం సోమాజిగూడలోని హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో జరిగింది. హైదరాబాద్ సంస్థానాన్ని నిజాం ప్రభువులు పరిపాలించినపుడు భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ పోలో, చర్చల సందర్భంగా రచయిత సయ్యద్ అలీ హష్మీ చూసిన అంశాలపై ఈ పుస్తకం రాశారు. పుస్తకాన్ని సీనియర్ పాత్రికేయుడు కింగ్ షుక్నాగ్ ఆవిష్కరించారు. హైదరాబాద్ సంస్థానంలో నిజాం పాలనను ప్రముఖ చరిత్రకారుడు కెప్టెన్ పాండురంగారెడ్డి ప్రశంసించారు. ఆనాటి చరిత్ర, పరిస్థితులను పుస్తకంలో పొందు పరిచారన్నారు. చాలా మంది నిజాం పాలనను వ్యతిరేకిస్తుంటారని, వాస్తవాలు వేరుగా ఉన్నాయని, 1969 తెలంగాణా ఉద్యమ కారుల సమాఖ్య కన్వీనర్ కొల్లూరి చిరంజీవి అన్నారు. పుస్తక రచయిత ఆనాటి అనుభవాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో స్పాట్ ఉపాధ్యక్షుడు సయ్యద్ ఇనాముల్ రెహ్మాన్ గయూర్, ప్రధాన కార్యదర్శి యాసీన్ హష్మీ, సయ్యద్ హసన్ హష్మీతో పాటు పలువురు పాల్గొన్నారు.