హైదరాబాద్,ఆంధ్రజ్యోతి:ప్రముఖ కవి చెరుకు సత్యనారాయణరెడ్డి రచించిన భావ భాస్వరం గేయ కవితాసంపుటి పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం భాషానిలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ సలహాదారు డా.కేవీ.రమణాచారి హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భావ భాస్వరం పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ చదవాల్సిన అవసరముందన్నారు. ఇలాంటి పుస్తకాలు మరిన్ని రావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోనప్ప, బాపురెడ్డి, ఫణీంద్ర, తాళ్లపల్లి మురళీధర్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.