మాదాపూర్‌,హైదరాబాద్:శిల్పారామంలో ఉగాది సంబరాలు అంబరాన్ని అంటాయి. బుధవారం ఉదయం నుంచి నగరవాసులు సందడి చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. 12 రాష్ట్రాలకు చెందిన జానపద కళాకారులు వివిధ నృత్యరూపకాలను ప్రదర్శించారు. అనంతరం సాగి కమలాకర్‌శర్మ పంచాంగ శ్రవణం పఠించారు.