హైదరాబాద్,ఆంధ్రజ్యోతి:షేక్స్‌స్పియర్‌ రాసిన కింగ్‌ లియర్‌ హ్యామ్‌ లెట్‌ నాటకాల్లోని పాత్రల ఆధారంగా రూపొందించిన ఫూల్స్‌ కోర్ట్‌ నాటకం ప్రేక్షకులను ఆకట్టుకుంది. నాటకంలో భాగంగా ప్రేక్షకులలోంచి కొందరిని ఎంచుకుని వారితో సంభాషిస్తూ, చర్చిస్తూ కథను నడిపించారు. తజకిస్తాన్‌కు చెందిన కనిబాదమ్‌ స్టేట్‌ మ్యూజిక్‌ అండ్‌ డ్రామా థియేటర్‌ వారిచే తజకిస్తాన్‌ భాషలో ఈ నాటకాన్ని ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ కె.వి.రమణాచారి, ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ, దేశపతి శ్రీనివాస్‌, మామిడి హరికృష్ణ తదితరులు హాజరై కళాకారులను అభినందించారు.