వైభవోపేతంగా హైదరాబాద్ ఒడిస్సీ ఉత్సవ్
రవీంద్రభారతి, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): ఆయా రాష్ట్రాల కళాకారుల కలయికతో నిర్వహించిన హైదరాబాద్ ఒడిస్సీ ఉత్సవ్ వైభవోపేతంగా జరిగింది. లయబద్ధమైన నాట్యాంశాలకు అద్భుతమైన అడుగులు వేస్తూ కళాకారులు ప్రేక్షకులను రంజింపజేశారు. ఆదివారం తెలుగు వర్సిటీలోని ఆడిటోరియంలో ఒడిస్సీ ఇంటర్నేషనల్ ఫోరం ఆధ్వర్యంలో హైదరాబాద్ ఒడిస్సీ ఉత్సవ్ శీర్షికన ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల కళాకారులచే ప్రత్యేక ఒడిస్సీ నృత్య ప్రదర్శనలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఫెస్టివల్ డైరెక్టర్ శ్యాంహరి చక్ర, చైర్పర్సన్ నాట్య గురు రామహరిదా్సలతోపాటు పలువురు ప్రముఖులు పాల్గొని కళాకారులను సత్కరించి అభినందించారు.