తొలి పుస్తకానికే 1.14 కోట్ల బహుమతి
రచయిత రఘు కర్నాడ్కు అంతర్జాతీయ అవార్డు
బెంగళూరు, మార్చి 15: ప్రముఖ రచయిత, పాత్రికేయుడు రఘు కర్నాడ్కు ప్రతిష్ఠాత్మకమైన వింధమ్-క్యాంప్బెల్ అవార్డు లభించింది. ‘ద ఫార్థ్స్ట్ ఫీల్డ్: యాన్ ఇండియన్ స్టోరీ ఆఫ్ ద సెకండ్ వరల్డ్ వార్’ పేరుతో కర్నాడ్ రాసిన తొలిపుస్తకానికే ఈ పురస్కారం దక్కడం విశేషం. ఈ అవార్డు కింద సుమారు రూ.కోటీ 14 లక్షల నగదు బహుమతి లభిస్తుంది. ఈ అవార్డు వచ్చిన భారతీయ రచయితల్లో కర్నాడ్ రెండో వ్యక్తి.