న్యూఢిల్లీ, 12-10-2018: వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన వారికి, దేశానికి సేవలందించిన వారికి కేంద్రప్రభుత్వం ఇచ్చే పద్మ అవార్డుల కోసం ఈ ఏడాది పోటీ పెరిగింది.2017 సంవత్సరానికిగాను పద్మ అవార్డుల కోసం 49,992 మంది నామినేషన్లు సమర్పించారు. గత నెల 15వతేదీలో పద్మ అవార్డుల కోసం పెద్ద సంఖ్యలో నామినేషన్లు రావడంతో కేంద్ర సర్కారు వీటిని పరిశీలించే పనిలో పడింది. 2010లో పద్మ అవార్డుల కోసం 1313 నామినేషన్లు వచ్చాయి. 2016లో 18,768 నామినేషన్లు రాగా, 2017 కల్లా వీటి సంఖ్య 49,992కు పెరిగాయి. నిస్వార్థంగా దేశానికి సేవలందిస్తున్న వారికి కేంద్రం పద్మఅవార్డులతో సత్కరించనుంది. 2019 గణతంత్ర దినోత్సవం రోజు పద్మ అవార్డులను ప్రకటించనున్నారు.