హైదరాబాద్‌, జనవరి 17: ‘చెల్లాచెదురైన తెలుగు వాళ్లను సమైక్యంగా ఉంచడం కోసం ప్రయత్నం చేసిన సమైక్య సంధాతలు కాకతీయ రాజులు.’ అని మహారాష్ట్ర గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర రావు అన్నారు. టీఎస్సార్‌ (టి. సుబ్బరామిరెడ్డి) కాకతీయ లలిత కళా పరిషత్‌ ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్‌లో జరిగిన ‘కాకతీయ కళావైభవ మహోత్సవం’ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ మహోత్సవంలో నటుడు మంచు మోహన్‌బాబుని ‘విశ్వ నట సార్వభౌమ’ బిరుదుతో సత్కరించారు.