కవాడిగూడ, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): కిరణ్‌ సాంస్కృతిక సమాఖ్య, త్యాగరాయగానసభల సంయుక్త ఆధ్వర్యంలో శనివారం రాత్రి కళాసుబ్బారావు కళావేదికలో జాతీయ స్థాయిలో 2017 కవితల పోటీలలో విజేతలకు పురస్కారాల ప్రదానం, పెరుముల కైలాస్‌ రచించిన తెలుగు వెలుగు శతకం ఆవిష్కరణ జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఆచార్య ఎన్‌.గోపి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. సభకు ప్రముఖ కవి దాస్యం సేనాధిపతి అధ్యక్షత వహించగా కార్యక్రమంలో గానసభ అధ్యక్షుడు కళా వి.ఎ్‌స.జనార్దనమూర్తి, డాక్టర్‌ ఎన్‌.ఆర్‌.కె.రెడ్డి, నేటి నిజం పత్రిక ఎడిటర్‌ బైసా దేవదాస్‌, పొత్తూరి జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అనంతరం కవితా పురస్కారాలను అతిథులు ప్రదానం చేశారు.