అమరావతి, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): 2018 సంవత్సరానికి కందుకూరి రంగస్థల పురస్కార గ్రహీతలను ప్రభుత్వం ఎంపిక చేసింది. కందుకూరి వీరేశలింగం 171వ జయంతి సందర్భంగా సోమవారం విజయవాడలో రాష్ట్ర చలన చిత్ర టీవీ, నాటక రంగ అభివృద్ధి సంస్థ చైర్మన్ అంబికా కృష్ణ వివరాలను వెల్లడించారు. ప్రొద్దుటూరుకు చెందిన దర్శకుడు, నటుడు సుంకర రాజశేఖర ప్రసాద్, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన నటుడు అల్లం చంద్రరావు, విశాఖకు చెందిన నటి ఆలపాటి లక్ష్మికి రాష్ట్రస్థాయి అవార్డులను అందించనున్నట్టు ప్రకటించారు. ఈ అవార్డు కింద రూ.లక్ష అందిస్తామన్నారు. అలాగే జిల్లా స్థాయిలో 65 మందిని విశిష్ట పురస్కారాలకు ఎంపిక చేసినట్టు ఆయన తెలిపారు.