రవీంద్రభారతి/హైదరాబాద్‌, డిసెంబరు 3: తెలంగాణకు మహోజ్వల సాంస్కృతిక వారసత్వం ఉందని, ఆ సంపదను గర్వకారణంగా భావించాలని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ అన్నారు. తెలంగాణ ఆత్మను ఆవిష్కరించుకునే సంకల్పంతోనే సీఎం కేసీఆర్‌ ప్రపంచ మహాసభల్ని నిర్వహిస్తున్నారని తెలిపారు.

మహాసభలకు నాందిగా సారస్వత పరిషత్తు తెలంగాణ సాహిత్య సౌరభాల పరంపరలో భాగంగా రెండో రోజు జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పండుగ వాతావరణంలో వారం పాటు సాహిత్య సౌరభాలు నిర్వహించడం అభినందనీయమన్నారు.