ప్రభుత్వ సలహాదారు రమణా చారి

కామారెడ్డి, ఫిబ్రవరి 18: ప్రాచీన కళలకు తెలంగాణలో పూర్వ వైభవం వస్తుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రమణాచారి అన్నారు. ఆదివారం కామారెడ్డిలో జరిగిన జిల్లా స్థాయి జానపద భజన పోటీల ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రాచీన కళలు, సాహిత్యాన్ని వెలికి తీసి నిరాదరణకు గురైన కళాకారులను ఆదరిస్తున్నారన్నారు. కళాకారులకు పింఛన్‌ సౌకర్యాన్ని కూడా కల్పించారన్నారు.