చిక్కడపల్లి, హైదరాబాద్, జూలై12(ఆంధ్రజ్యోతి): ఇనాక్‌ గొప్ప రచయిత అని తమిళనాడు మాజీ గవర్నర్‌ డా. కె. రోశయ్య అన్నారు. ప్రముఖ రచయిత ప్రొ. కొలకలూరి ఇనాక్‌ సాహితీ సప్తాహం గురువారం ముగిసింది. త్యాగరాయగానసభలో జరిగిన కార్యక్రమంలో ఇనాక్‌ను సన్మానించిన రోశయ్య మాట్లాడుతూ ఇప్పటికే ఎన్నో పుస్తకాలు రచించిన ఇనాక్‌ మరో నాలుగు రచనలు చేస్తే వంద పుస్తకాల రచన పూర్తవుతుందని త్వరలోనే ఆ పని కూడా విజయవంతంగా చేస్తారని అభినందించారు. ఆయన రచనలు సామాన్య జనాల కన్నీళ్లను తుడిచేందుకు ఎంతో ఉపయోగపడ్డాయని అన్నారు. ఈ కార్యక్రమంలో గానసభ అధ్యక్షుడు కళా జనార్దనమూర్తి, సాహితీవేత్త ఓలేటి పార్వతీశం, రేవూరి అనంతపద్మనాభరావు, టి గౌరీశంకర్‌, జిలుకర శ్రీనివాస్‌, చెన్నూరి సీతారాంబాబు, ఛందోజిరావు పాల్గొన్నారు.