రవీంద్రభారతి, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): తెలుగు ప్రేక్షకులను రంజింపజేస్తున్న నటీనటులను సత్కరించుకోవడం అభినందనీయమని ప్రముఖ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. తెలుగు నూతన సంవత్సరాది ఉగాది పండుగ పురస్కరించుకుని సంగమం సంస్థ ఆధ్వర్యంలో సోమవారం సంస్థ కార్యాలయంలో ఉగాది వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ నటుడు సుబ్బరాయ శర్మ, నటి శ్రుతిలకు సంగమం ఉగాది పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా తమ్మారెడ్డి భరద్వాజతో పాటు ప్రముఖ గాయని శోభారాజు, లక్ష్మీపార్వతి, రేలంగి నరసింహారావు, నటుడు బాలాదిత్య. బంటి, సంజయ్‌కిషోర్‌ హాజరై సుబ్బరాయశర్మ, శ్రుతిని ఘనంగా సత్కరించి అభినందించారు.