‘గజల్’పై కేసును వాపస్ తీసుకోవాలి
మహిళ బెదిరింపు..బాధితురాలి ఫిర్యాదు
పంజగుట్ట, మే 25 (ఆంధ్రజ్యోతి): గజల్ శ్రీనివాస్పై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలంటూ బాధితురాలికి ఓ మహిళ ఫోన్లో బెదిరించింది. దీంతో ఆందోళన చెందిన ఆమె ఆ మహిళపై పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కోర్టు అనుమతితో పంజగుట్ట పోలీసులు మహిళపై కేసు నమోదు చేశారు. గజల్ శ్రీనివాస్ తనను లైంగికంగా వేధించడమే కాకుండా నానా రకాలుగా ఇబ్బంది పెట్టాడంటూకరీంనగర్ జిల్లాకు చెందిన అరుణ అనే యువతి చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు గతంలోనే కేసులు నమోదు చేసి శ్రీనివా్సను అరెస్ట్ చేశారు. ఈ నెల12న కృష్ణానగర్కు చెందిన విజయలక్ష్మి అనే మహిళ అరుణకు ఫోన్ చేసి, గజల్ శ్రీనివా్సపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని బెదిరించింది. తనకు ప్రాణభయం ఉందని,ఆరోపిస్తూ విజయలక్ష్మిపై పోలీసులకు అరుణ ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు...కేసు నమోదుపై కోర్టు అనుమతి కోరుతూ లేఖ రాశారు. కోర్టు అనుమతి ఇవ్వడంతో గురువారం విజయలక్ష్మిపైఐపీసీ 506 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.