కవి, పద్య కావ్యాల రచయిత అక్కిరాజు సుందర రామకృష్ణ. అంతేకాదు, ఆయన నటుడు, గాయకుడు, బోధకుడు మధుర వక్త, బహుముఖ ప్రజ్ఞాశాలి. దేశ విదేశీ పర్యటనలతో అపారమైన అనుభవాల్ని మూటగట్టుకున్న రచయిత. అధిక్షేప కవితారత్న, పద్య విద్యామణి బిరుదాంకితుడు. ఇప్పటివరకు ముప్ఫై పుస్తకాలు వెలువరించారు. వ్యంగ్యం, హాస్యం కలబోసిన ఈ తాజా పుస్తకంలోని ముప్పై వ్యాసాల్లో, ఎన్నో జ్ఞాపకాలు, జ్ఞానార్జనకు దోహదం చేసే ఆయన అనుభవాలెన్నో కనిపిస్తాయి.
నా మాటలు
డా.అక్కిరాజు సుందర రామకృష్ణ
ధర : అమూల్యం, పేజీలు : 276
ప్రతులకు : రచయిత, డి.డి.కాలనీ,
బాగ్ అంబర్పేట్, హైదరాబాద్–013 సెల్ 988 50 20 205