రవీంద్రభారతి, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి): సత్కళాభారతి, రమణి ఆర్ట్స్‌ అకాడమీ సంయుక్త నిర్వాహణలో ఈ నెల 27న సాయంత్రం 6గంటలకు హిమాయత్‌నగర్‌లోని టీటీడీ కల్యాణ మండపంలో ప్రవన వాచస్వతి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రత్యేక ప్రసంగం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డా.కేవీ.రమణాచారి ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో ధర్మాచరణ ప్రాధాన్యం అనే అంశంపై ప్రవచనం ఉంటుందని తెలిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనాలని సత్కళాభారతి సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు.