జాతీయ పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం
తెలుగు రచయితల ఆధ్వర్యంలో..
బెంగళూరు, 26-06-2019: కర్ణాటక తెలుగు రచయితల సమాఖ్య ఆధ్వర్యంలో కళ్లే శేష శయనం స్మారక సాహితీరత్న జాతీయ పురస్కారం 2019కి గాను కవితా సంపుటాలను ఆహ్వానిస్తున్నారు. 2018-19 సంవత్సరంలో ము ద్రించిన కవితా సంపుటాలు మూడింటిని ఈ పోటీకి పంపుకోవాల్సి ఉంటుంది. ఈ కవితా సంపుటి మొదటిదై ఉండాలి. ఎంపికైన కవితా సంపుటికి పురస్కారంతోపాటు రూ.5,116 నగదు అందించి సన్మానిస్తారు. ఈ మేరకు సంస్థ ప్రతినిధులు నగరంలో మంగళవారం ఒక ప్రకటన విడుదల చే సింది. మరిన్ని వివరాలకు 98864 04328 నందు సంప్రదించాల్సి ఉంటుందని సమా ఖ్య ప్రధాన కార్యదర్శి కళ్ళే వెంకటేశ్వర శా స్త్రి పేర్కొన్నారు.