రవీంద్రభారతి, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఇటీవల ప్రకటించిన సాహితీ పురస్కారాలను ఈ నెల 28వ తేదీన ప్రదానం చేయనున్నారు. తెలుగు వర్సిటీలోని ఎన్టీఆర్‌ కళా మందిరంలో మధ్యాహ్నం 3 గంటలకు కార్యక్రమం జరుగుతుందని వర్సిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య అలేఖ్య పుంజాల ఒక ప్రకటనలో తెలిపారు. 2017 సంవత్సరానికి తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియల్లో ఉత్తమ గ్రంథాల రచయితలకు సాహితీ పురస్కారం పేరిట సత్కరిస్తారు. పురస్కార గ్రహీతలను రూ.20,116 నగదు, జ్ఞాపికతో సత్కరిస్తారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ హాజరవుతారు.