జీబనానంద దాస్ మరణించిన తర్వాత వొక ఎక్సర్సైజ్ నోట్ బుక్లో ఆయన రాసుకున్న 62 కవితల్ని గుర్తించి ‘రూపసీ బంగ్లా’గా ప్రచురించిన కవితా సంకలనం గొప్ప సంచలనం కలిగించింది. యీ కవితలన్నింటినీ ఆయన మరణించినడానికి 20 యేళ్ళ ముందే అంటే 1934లో రాసినట్లు గుర్తించారు. యీ సంకలనంలోని కవితలు వస్తురీత్యా, ఆధునిక పద సౌందర్యం దృష్ట్యా ఆయన ఆ తర్వాత రాసిన కవితలన్నింటి కన్నా మేలైనవిగా ప్రసంశలందుకున్నాయి.
‘‘జగతిలోని సకల జీవ శబ్దాల్లోపల్చబడి మౌనంలోకి వొదిగిపోయాకమృత్యు వస్త్రాన్ని సైతంనిలువెల్లా కప్పేసాకకడసారి వీడ్కోలులాగుండెను తడుతూ అడిగింది ‘గుర్తుపట్టావా నన్ను’అడిగాను చివరి శ్వాసతో... ‘బనలతా సేన్వా?’
జీబనానంద్ దాస్
యీ కవిని చదువుకొన్న క్షణంలో ఆ పద సౌందర్యంలో మునగంగానే అర్ధరాత్రి కలకత్తా వీధుల నిశ్శబ్దంలోనో... బాబీలోనియా వీధుల చెమ్మలోనో... బింబి సారుడు వేసి వెళ్ళిన బాటలోనో తచ్చాడుతోన్న అనుభూతి వుక్కిరిబిక్కిరి చేసేసింది. బెంగాల్ వీధుల్లో నన్ను నేను కోల్పోయి అశాంతితో వొక అన్వేషిలా తిరుగాడిన రోజుల నుంచీ యీ కవిత్వాన్ని పలవరిస్తూ కలవరిస్తూ పిచ్చికగూళ్లల్లాంటి కళ్ళున్న బనలతా సేన్ని వెతికి పట్టుకొని ఆలింగనం చేసుకొని ఆపాదించుకోవాలనే వెర్రితపనేదో కుదిపేసింది. ఆ దిరిసెన చెట్ల అడివిలానో పొగమంచు నదిలానో యీ కవిత్వంలో నన్ను నేను వెదుకొన్న క్షణాల నుంచీ యీ కవిత్వాన్ని అనువదించి తెలుగు పాఠకుల ముందుకి వో కవితా సంకలనంగా తీసుకురాబోతున్న యీ సమ యంలో, జిబనానంద్ దాస్ గారి వర్ధంతి సంధర్భంగా వారి కవిత్వం గురించి పంచుకోవాలనిపించింది.బెంగాలీ సాహిత్యంలో రవీంద్రని తర్వాత.. వారు వేసిపోయిన మార్గాన్ని మరింత ప్రతిభావంతంగా యెత్తిపట్టిన కవి జీబనానంద్ దాస్ (1899 - 1954). రవీంద్రుని తదనంతరం ఆయన ప్రభావం నుంచి బయటపడేందుకు బెంగాల్ కవులు పెద్ద యుద్ధమే చేయా ల్సివచ్చింది.అభ్యుదయ కవులు కొంతవరకు విజయం సాధించి సొంత గొంతుల్ని యెత్తిప ట్టారు. రవీంద్రుని ప్రభావం నుంచి బయటకు రావడా నికి యిష్టపడని జీబనానంద్ దాస్ రవీంద్రుని సాంప్రదా యాన్ని అధ్బుత కవితా శక్తితో బలమైన భావవ్యక్తీ కరణతో ముందుకు తీసుకు వెళ్ళారు.
ఆ యిమేజరీలు... వుక్కిరిబిక్కిరి చేసే కవితా ధార... చిక్కని పదబంధాలు యెప్పటికీ వెంటాడుతూనే వుంటాయి. యిప్పటికీ బెం గాల్ కవిత్వం మీద జీబనా నంద్ ముద్ర కొనసాగు తూనే ఉంది.జీబనానంద్ కవిత్వంలో తరుచుగా కనిపించే ‘‘బన లతా సేన్’’ కవిత దాదా పుగా రవీంద్రుని గీతాంజలి యెన్ని భాషల్లోకి యెన్ని అనువాదాలకు నోచుకుందో అన్ని అనువాదాలకూ నోచు కుంది. ఆ కవిత నిరంతర ఆకర్షణ. అసలు యెవరీ బన లత అని పరిశోధనలు కూడా చేశారంటే, చివరికి యీ మిస్టిక్ కేరెక్టర్ వల్ల ఆయన వ్యక్తిగత జీవితం కూడా ధ్వంసం అయిందంటే... బన లత సేన్ ప్రభావాన్ని అర్థం చేసుకోవచ్చు.చివరకు చాలా విషాదంగా జీబనానంద్ దాస్ కలకత్తా లోని ట్రామ్ కార్ కింద పడి 1954 అక్టోబర్ 22న తన 55 యేట మరణించారు. ఆంగ్ల అధ్యాపకుడిగా పని చేస్తూ, వ్యక్తిగత జీవితంలో అనేక ఆటుపోట్లని యెదుర్కొంటూ ట్రామ్ కారు కింద తన జీవితానికి ముగింపు వాక్యం రాసుకున్నారని తన సన్నిహి తులు పేర్కొంటారు. యేది యేమైనా యీ బెంగాల్ సౌం దర్యసీమలను వదిలివెళ్లలేనని యెలుగెత్తి చెప్పిన కవి జీబనానంద్ దాస్.