శిఖామణి సాహితీ పురస్కారాలు 2021లో భాగంగా జీవన సాఫల్య కృషికి ఇచ్చే పురస్కారానికి నగ్నముని, ఈ ఏడాది నుంచి కొత్తగా ప్రారంభించిన ‘శిఖామణి యువ సాహితీ పురస్కారానికి’ ‘నడిచే దారిలో’ కవితా సంపుటి కవి సురేంద్ర దేవ్‌ చెల్లి ఎంపిక అయ్యారు. కవిసంధ్య ప్రతిభా పురస్కా రాలకు వివిధ రంగాల నుంచి: ప్రసేన్‌, కరీముల్లా, గుడిపాటి వెంకటేశ్వర్లు, వల్లూరు శివప్రసాద్‌, ముకుంద రామారావు, గనారా, ఈమని శివనాగిరెడ్డి, కె. వరలక్ష్మి, మధునాపంతుల సత్యనారాయణమూర్తి, బండి ప్రసాదరావు, వెలమల సిమ్మన్న, సి.హెచ్‌. సుశీలమ్మ ఎంపికయ్యారు. అక్టోబరు చివరి వారంలో పురస్కార ప్రదానోత్సవం ఉంటుంది.

శిఖామణి