అప్పాజోస్యుల, విష్ణుభొట్ల, కందాళం ఫౌండేషన్‌ ఏటా ప్రకటించే ప్రతిష్టాత్మక విశిష్ట సాహితీ పురస్కారాలను 2022 సంవత్సరానికి తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి, శిఖామణి, మాకినీడి సూర్యభాస్కర్‌లు స్వీకరిస్తారు. జనవరి 6 నుంచి 9 వరకు కాకినాడ దంటు కళా క్షేత్రంలో జరిగే ఫౌండేషన్‌ 29వ వార్షిక సభల్లో ఈ పురస్కారాల ప్రదానం జరుగుతుంది. మూడు రోజులు ఉదయం 10గం.లకు పుర స్కార గ్రహీతల సాహిత్యకృషి సమాలోచన సదస్సులు, సాయంత్రం 6గంటలకు పురస్కార ప్రదానాలు ఉంటాయి. వీటితో పాటు రంగస్థల సేవా మూర్తి పురస్కారాలు, పోటీ నాటికల ప్రదర్శనలు, గ్రంథావిష్కరణలు ఉంటాయి.

అజో - విభొ- కందాళం ఫౌండేషన్‌