నిర్మల్‌ కల్చరల్‌, మార్చి 10 : నిర్మల్‌ జిల్లాకు చెందిన ప్రముఖ కవి, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మడిపల్లి భద్రయ్యను ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అభినందించారు. ఈ మేరకు బుధవారం కవి భద్రయ్యకు అభినందన పత్రాన్ని పంపారు. ‘మన భాష.. మన యాస’ పేరిట రాసిన పద కోషం, బతుకు బాట, శ్రీరామ చరితం తదితర పుస్తకాలను పరిశీలించినట్లు వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. భద్రయ్య చేసిన సాహిత్య కృషి అభినందనీయమని ప్రశంసించారు. కాగా.. వెంకయ్యనాయుడు తనకు అభినందన పత్రాన్ని పంపడం పట్ల భద్రయ్య హర్షం వ్యక్తం చేశారు.