తెలంగాణ సాహిత్య అకాడెమీ, హైదరాబాద్‌ ప్రభుత్వ సిటీ కళాశాల తెలుగుశాఖ ఆధ్వర్యంలో ‘ఆధునిక భారతీయ కవిత్వంలో మహిళా చైతన్యం’ అంశంపై అంతర్జాల సదస్సు మార్చి 10 ఉ.10గం.ల నుంచి నాలుగు సమావేశాలుగా జరుగుతుంది. నవీన్‌ మిత్తల్‌, పి. బాల భాస్కర్‌, మామిడి హరికృష్ణ, కాత్యాయని విద్మహే, జె. నీరజ, కె. గీత, మాడభూషి సంపత్‌ కుమార్‌, కొలకలూరి ఆశాజ్యోతి, సునీతారాణి, వి. కృష్ణ, పెన్నా మధుసూదన్‌, జమీల నిషాత్‌, యల్‌.ఆర్‌. స్వామి, వి. త్రివేణి తదితరులు పాల్గొంటారు.

కోయి కోటేశ్వరరావు