రవీంద్రభారతి,హైదరాబాద్:ప్రపంచ మహిళా దినోత్సవం పురస్కరించుకుని మిఠాయి థియేటర్‌, భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం తెలుగు వర్సిటీలోని ఆడిటోరియంలో ప్రముఖ దర్శకుడు దీనబాంధవ దర్శకత్వం వహించిన బిస్కెట్‌ బేబీ నాటకం ప్రదర్శించారు. నాటకంలో రేడియో జాకీలు ఝాన్సీరెడ్డి, జ్యోతిరెడ్డి, రమ్యకృష్ణ, రేఖ, ప్రవళిక, జమున, రేవతితో పాటు నటులు పెద్దుల శ్రీనివాస్‌, అంజిబాబు, లింగస్వామి, అభిషేక్‌, పవన్‌కుమార్‌, మనోహర్‌ తదితరులు నటించారు. సినీ నటుడు ఉత్తేజ్‌ నటీనటులను సత్కరించారు. కార్యక్రమంలో దర్శకులు ఖాజాపాషా, జబర్దస్త్‌ అప్పారావులతో పాటు ఆల్‌ ఇండియా రేడియో ప్రతినిధులు పాల్గొన్నారు.