విశాఖలో జూలై 31న ‘శతమయూర నృత్యం’
మధురవాడ,ఆంధ్రజ్యోతి: టీ.ఎస్ కళాసమితి 43వ వార్షికోత్సవం సంధర్భంగా వంద మంది కళాకారులతో మధురవాడ శిల్పారామంలో ఆదివారం శతమయూర నృత్యకార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కళాసమితి నిర్వాహకురాలు కల్యాణిభవ్య తెలిపారు. శుక్రవారం శిల్పారామంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కూచిపూడి నృత్యరీతుల్లో ఈ కార్యక్రమం కొనసాగుతందన్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతున్నట్లు ఆమె తెలిపారు. విలేకరుల సమావేశంలో జిల్లా సాంస్కృతిక మండలి సభ్యుడు కొసనా,శిల్పారామం పరిపాలానాధికారి గణేష్ పాల్గొన్నారు.