మధునాపంతుల సత్యనారాయణ ‘ఆంధ్ర రచయితలు’, ‘ఆంధ్ర పురాణం’ వంటిఉద్గ్రంథాల రచయిత. ఉత్కృష్టమైన సాహితీప్రతిభకు దీటైన నిర్మల వ్యక్తిత్వంఆయనది. దాన్ని ఈ తరానికి పరిచయం చేస్తూ... మధునాపంతులవారి శతజయంతి సందర్భంగా ‘మధుస్మృతి’తో తన గురువుగారి జీవితాన్ని జ్ఞాపికగా అందిస్తున్నారు రచయిత. ఆరుద్ర, విశ్వనాథ వంటి సమకాలీకులతో అనుబంధాలతో పాటు... స్వయంగా తను చూసి మైమరచిన సందర్భాలను అక్షరబద్ధం చేశారు.

- కె.ఎల్‌.సూర్య

మధుస్మృతి,

రచన: సన్నిధానం నరసింహశర్మ

పేజీలు: 152,

వెల: 100,

ప్రతులకు: ప్రముఖ పుస్తక కేంద్రాలు