చాసో 102వ జయంతి వేడుకల సందర్భంగా విజయ నగరంలో చాసో సాహితీ వేదిక (ఎ.సి.హాలు) ప్రారంభో త్సవమూ, చాసో స్ఫూర్తి పురస్కార ప్రదానమూ ఈ నెల 17న జరుగుతాయి. ఉ.10 నుండి సా.5గంటల వరకూ ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి చాగంటి కృష్ణకుమారి స్వాగతం పలుకుతారు. అధ్యక్షులు కేతు విశ్వనాథరెడ్డి, గౌరవ అతిథి బి.రామారావు, ప్రధాన వక్త కె.శ్రీనివాస్‌. మధ్యాహ్నం 2గం.లకు చాసో ‘కుంకుడాకు’ నాటకీకరణ జి.ఎస్‌.చలం ఆధ్వర్యంలో ప్రదర్శితమవుతుంది. చాసో స్ఫూర్తి పురస్కారాన్ని రచయిత ఎం.ఎం. వినోదిని స్వీకరిస్తారు.

-చాగంటి తులసి