హైదరాబాద్లో జూన్ 25న ‘ఎవరి దుఃఖమో అది!’ కవితా సంపుటి
ఎన్.గోపి రచించిన ‘ఎవరి దుఃఖమో అది!’ కవితా సంపుటి ఆవిష్కరణ సభ తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, కిన్నెర ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో జూన్ 25, సా.6గం.లకు రవీంద్ర భారతి సమావేశ మందిరం (మొదటి అంతస్తు), హైదరాబాద్ నందు జరుగుతుంది. ముఖ్య అతిథి, ఆవిష్కర్త జలజం సత్యనారాయణ; కృతి స్వీకర్త పొత్తూరి వెంకటేశ్వరరావు; అధ్యక్షులు వోలేటి పార్వతీశం; విశిష్ట అతిథి మామిడి హరికృష్ణ; గ్రంథ సమాలోచనం సీతారామ్.
- ఆర్. ప్రభాకరరావు