ఒంగోలు కల్చరల్‌: నవ్యాంధ్ర రచయిత్రుల సంఘం(నరసం) తొలి రాష్ట్ర మహాసభలు ప్రకాశం జిల్లా ఒంగోలులో ఈనెల 15న జరగనున్నట్టు సంఘ గౌరవాధ్యక్షురాలు తేళ్ల అరుణ తెలిపారు. ఒంగోలులో గురువారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలోని అన్ని ప్రక్రియలను ముందుకు తీసుకువెళ్లే విధంగా ఈ మహాసభల్లో పలు తీర్మానాలను ఆమోదించనున్నట్టు ఆమె తెలిపారు.