పాల్గొననున్న సూపర్‌ స్టార్‌ కృష్ణ 

హైదరాబాద్,ఆంధ్రజ్యోతి: మోదుకూరి జాన్సన జీవిత చరిత్రపై తెనాలికి చెందిన రచయిత గుంటూరు కృష్ణ రచించిన చెరగని జ్ఞాపకం పుస్తకాన్ని హైదరాబాద్‌లో బుధవారం సూపర్‌ స్టార్‌ కృష్ణ ఆవిష్కరించనున్నట్లు రచయిత మంగళవారం తెలిపారు. మరో ప్రపంచం, మానవుడు దానవుడు, డబ్బుకు లోకం దాసోహం, దేవోద్దారకుడు, నేరము శిక్ష, బంగారు భూమి, దేవాలయం, కరుణామయుడు, నేటి భారతం తదితర చిత్రాలకు మాటలు, పలు చిత్రాలకు పాటలు మోదుకూరి జాన్సన రాశారని కృష్ణ తెలిపారు. 50 చిత్రాలకు పైగా మాటలు సమకూర్చారని చెప్పారు. జాన్సన సినీ విశేషాలతో పుస్తకాన్ని రచించినట్లు వివరించారు.