చిక్కడపల్లి, హైదరాబాద్, జూలై17(ఆంధ్రజ్యోతి): తెలంగాణ గడ్డమీద పుట్టిన గొప్ప పండితుడు కప్పగంతుల లక్ష్మణశాస్త్రి అని వక్తలు పేర్కొన్నారు. త్యాగరాయగానసభ ఆధ్వర్యంలో గానసభలో మంగళవారం రాత్రి ప్రముఖ సాహితీవేత్త కప్పగంతుల లక్ష్మణశాస్త్రి వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రముఖ రచయిత, విమర్శకుడు రమణ వెలమకన్నిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అధికారభాషాసంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకరరావు, గానసభ అధ్యక్షుడు కళా జనార్దనమూర్తి, గాయని చంద్రజ్యోతి తదితరులు ప్రసంగించారు. లక్ష్మణశాస్త్రి మహామహోపదాధ్యాయ బిరుదు పొందారన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు గాయకులు పాల్గొన్నారు.