త్యాగరాయ గాన సభలో వక్తలు ఫ పలు రంగాల ప్రముఖులకు ప్రదానం

18-10-2017: అర్హులకు పురస్కారాలను ఇవ్వడం వల్ల ఆ పురస్కారాలకే వన్నె పెరుగుతుందని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ కేవీ రమణా చారి అన్నారు. శ్రీ కమలాకర లలిత కళాభారతి ఆధ్వర్యంలో మంగళవారం సా యంత్రం త్యాగరాయగానసభలో రాష్ట్రపతి అవార్డుగ్రహీత, రిటైర్ట్‌ ప్రిన్సిపాల్‌ కేసీ కేశవరావు 89వ జన్మదినోత్సవం సందర్భంగా ప్రముఖులకు విశిష్ట పురస్కా ర ప్రదాన కార్యక్రమం జరిగింది. పురస్కారాలను ప్రదానం చేసిన రమణాచారి మాట్లాడుతూ పురస్కారాలు తీసుకున్న వారు తమ తమ రంగాల్లో మరింత సమాజ సేవ చేసే అవకాశం ఉంటుందన్నారు. ప్రముఖ కవి సుధామ, తెలుగు యూనివర్శిటీ పూర్వ రిజిస్ట్రార్‌ ఆచార్య టి. గౌరీశంకర్‌, సెంట్రల్‌ యూనివర్శిటీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డా. ఎ. భీమయ్యలకు పురస్కారాలను ప్రదానంచేశారు.