రవీంద్రభారతి, నవంబర్‌ 18 (ఆంధ్రజ్యోతి): తెలుగు సాహిత్య కళాపీఠం ఏడో వార్షికోత్సవం  ఘనంగా జరిగింది.  ఆదివారం రవీంద్రభారతి కాన్ఫరెన్స్‌ హాల్లో జరిగిన కార్యక్రమంలో వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారికి విశిష్ట పురస్కారాలు అందజేశారు. ఇందులో భాగంగా ఎం.నారాయణశర్మ, దోరవేటి చెన్నయ్య, కూర చిదంబరం, కొత్త కృష్ణవేణి, కొంపల్లి నిహారిణి, అనిల, ఎడ్ల లక్ష్మి, తదితరులకు ఈ పురస్కారాలతో ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా సీనియర్‌ పాత్రికేయుడు బైస దేవదాసు, వడ్డేపల్లి కృష్ణ, పట్టాల అశోక్‌కుమార్‌, ఈటల సమ్మన్న, బూర్గుల మధుసూదన్‌, కవితిలక తిరునగరి, ఇసారపు అచ్చయ్య, వనం చంద్రమౌలి, చిక్కా దేవదాసు తదితరులు పాల్గొని పురస్కారగ్రహీతలను సన్మానించారు. సభకు ముందు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. జానపద గీతాలు, నృత్యాలతో కళాకారులు హోరెత్తించారు.