హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి

హైదరాబాద్, చిక్కడపల్లి : భారతీయ సంస్కృతిని పరిరక్షిస్తున్న కళా, సాంస్కృతిక రంగాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రం త్యాగరాయగానసభలో నృత్యగురువు ఓలేటి రంగమణి శిష్యురాలు అభిజ్ఞ సింహనందిని నృత్యాన్ని ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి నాయిని మాట్లాడుతూ అభిజ్ఞ నాట్యం కన్నులపండువగా ఉందన్నారు. ఇప్పటి సినిమాలు సంస్కృతిని పాడుచేస్తున్నాయన్నారు. కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్శిటీ వీసీ ప్రొ. రామచంద్రం, వైద్యులు చిరంజీవి, వంశీరామరాజు, తదితరులు పాల్గొన్నారు.