విజయవాడ, 18-05-2018: సుమధుర కళానికేతన్‌ హాస్య నాటికల పోటీలు జూలై 27, 28, 29 తేదీలలో నిర్వహించనున్నట్లు సంస్థ ప్రతినిధి పసుమర్తి భాస్కరశర్మ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సుమధుర ప్రతీ ఏటా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ పోటీల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల నాటక సమాజాలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన తెలుగు వారు పాల్గొనవచ్చని ఆయన తెలిపారు. ఆసక్తి కలిగిన వారు సమాజాలు పూర్తి చేసిన దరఖాస్తులు జూన్‌ 5వ తేదీలోపుగా సుమధుర కళానికేతన్‌ సంస్థ కార్యాలయానికి పంపించవల్సిందిగా ఆయన సూచించారు. దరఖాస్తులో సూచించిన నియమనిబంధనలు అనుసరించి పోటీలో పాల్గొనాలన్నారు. మరిన్ని వివరాలకు 98853 29492, 98482 23484 నెంబర్లను సంప్రదించగలరని, కార్యాలయ చిరునామా సుమధుర కళానికేతన్‌, డోర్‌ నెంబర్‌ 16-2-39, లక్ష్మణరావు వీధి, పూర్ణానందంపేట, విజయవాడ - 520003కు దరఖాస్తులు పంపించవచ్చని భాస్కరశర్మ సూచించారు.