చిక్కడపల్లి,సెప్టెంబర్11(ఆంధ్రజ్యోతి): అక్షరాన్ని నమ్ముకున్న రావికంటి వసునందన్కు కాళోజీ పురస్కారాన్ని ప్రదానం చేయడం అభినందనీయమని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ డా. నందిని సిధారెడ్డి అన్నారు. కళానిలయం ఆధ్వర్యంలో బుధవారం త్యాగరాయగానసభలో కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా కవి, ఆచార్య వసునందన్కు కాళోజీ పురస్కారాన్ని ప్రదానం చేశారు. పురస్కారాన్ని ప్రదానం చేసిన నందిని సిధారెడ్డి మాట్లాడుతూ తెలంగాణాలో సాహితీ చైతన్యం పెరిగిందన్నారు. ప్రజలహృదయాల్లో నిలిచిన కవి కాళోజీ నారాయణరావు అన్నారు. ఈ కార్యక్రమలో గానసభ అధ్యక్షుడు కళా జనార్దనమూర్తి, పులివర్తి కృష్ణమూర్తి, నాళేశ్వరం శంకరం, కావూరి శ్రీనివాస్, సురేందర్ పాల్గొన్నారు.