ఆటా, టాటా సంయుక్త ప్రకటన

న్యూఢిల్లీ, మే 17(ఆంధ్రజ్యోతి): కేంద్రీయ హిందీ సమితి సభ్యుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌కు అమెరికా తెలుగు అసోసియేషన్‌(ఆటా), తెలంగాణ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌(టాటా) సంయుక్తంగా జీవితకాల పురస్కారాన్ని ప్రకటించాయి. మే 31 నుంచి జూన్‌ 2 వరకు డల్లా్‌సలో నిర్వహించే సదస్సులో ఈ పురస్కారాన్ని అందజేస్తామని ఆటా అధ్యక్షుడు డాక్టర్‌ కరుణాకర్‌రెడ్డి, టాటా అధ్యక్షుడు హరినాథ్‌ పొలిచెర్ల వెల్లడించారు. 1990లో ఏర్పడిన ఆటా, 2015లో ఏర్పడిన టాటా మొట్టమొదటిసారి సంయుక్తంగా సదస్సు నిర్వహిస్తున్నాయి. అమెరికా వ్యాప్తంగా దాదాపు 4500 మంది ప్రముఖ రచయితలు, కవులు, మేధావులు, శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలు, డాక్టర్లు, కళాకారులు, యువకులు ఈ సదస్సులో పాల్గొంటారని నిర్వాహకులు వివరించారు.