గుంటూరు (సాంస్కృతికం), జనవరి 18 : ఎన్టీఆర్‌ అవార్డు అందుకోవడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని అలనాటి కథానాయిక రాజశ్రీ అన్నారు. గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో కళాదర్బార్‌ అమరావతి ఆధ్వర్యంలో శుక్రవారం ఎన్టీరామారావు స్మారక ఫిల్మ్‌ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. రాజశ్రీతో పాటు శరత్‌బాబు, సినీ నిర్మాత కాట్రగడ్డప్రసాద్‌, భానుచందర్‌, గౌతమిలకు కళాదర్బార్‌ అమరావతి ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ పురస్కారాలను అందజేశారు.