ఏలూరు, 19-09-2018: నందీ నాటక బహుమతుల ప్రదానోత్సవాన్ని ఈ నెల 30న జరపనున్నట్టు ఎఫ్‌డీసీ చైర్మన్‌ అంబికా కృష్ణ తెలిపారు. మంగళవారం ఏలూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ 2017 నందీ నా టక బహుమతులు 72 మందికి, 2017 రాష్ట్రస్థాయి ఎన్టీఆర్‌ రంగస్థల పురస్కారం ఒకరికి, 2018 రాష్ట్రస్థాయి కందుకూరి ప్రతిష్ఠాత్మక, విశిష్ట రంగస్థల పురస్కారాలు ముగ్గురికి, జిల్లా స్థాయిలో 65 మందికి అందజేయనున్నట్టు తెలిపారు.